కూకట్పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడి హత్య

By Ravi
On
కూకట్పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడి హత్య

కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. యువకుడిని హత్య చేసింది. గత రాత్రి సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌ సమీపంలో ఉన్న పార్కులో ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా అపార్టుమెంట్ వాచ్మెన్‌తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు. నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడు. వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags:

Advertisement

Latest News

వికారాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ వికారాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి రాజనర్సింహ
ప్రతి పేదవాడికి ఆత్మ స్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.  సోమవారం వికారాబాద్  పట్టణ...
ఆ అబ్బాయిలకు.. అమ్మాయిలు దొరకరట.. పెళ్లిళ్లు కష్టమేనట..
ఉప్పల్ లో గంజాయి గోదాం.. ఎక్సైజ్ అధికారుల దాడి
పోయిన మీ ఫోన్ ఇందులో ఉందా.. చెక్ చేసుకోండి
ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు
జల వనరులను దోచేస్తున్న బాలాజీ డెవలపర్స్
నార్సింగిలో విషాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య