బీజేపీ నాయకురాలి దారుణ హత్య.
తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమెను అత్యంత కిరాతకంగా దుండగులు అంతం చేశారు. ఆమె తలను నరికి అత్యంత పాశవికంగా హత్య చేశారు. కాగా మహిళా నేత హత్యతో తమిళనాడు ఉలిక్కిపడింది. గత రాత్రి శరణ్య ఇంటికి వెళుతుండగా వెంటాడిన దండుగులు తల నరికి చంపారు. మధురై సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ మాజీ నాయకురాలుగా ఉన్న శరణ్య.. గత ఎడాది మధురై పర్యటన సమయంలో మంత్రి పళబివేల్ త్యాగరాజన్ కారుమీదా శరణ్య చెప్పులు విసిరింది. ఆ కేసులో శరణ్య సహా పలువురు బిజెపి నేతలు అరెస్టు అయ్యారు.
రాజకీయ కక్షలతో హత్య జరిగిందా లేక వ్యక్తిగత గొడవల కారణంగా ఈ ఘోరానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.