మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అదేశాల మేరకు ఎస్ టి ఎఫ్ టీమ్ల దాడులతో ఎక్సైజ్శాఖకు మంచి గుర్తింపు వచ్చిందని, డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడంలో కీలక భూమిక పోషించడం జరిగిందని ఎక్సైజ్ ఎన్ఫొర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి అన్నారు. సోమవారం 79 మందికి ఎక్సైజ్ భవన్లోని సమావేశ మందిరంలో క్యాష్ రివార్డులు పంపిణి చేశారు. ఎస్ టి ఎఫ్ ,టీమ్లతోపాటు హైదారాబాద్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ను అన్ని స్థాయిలో క్యాష్ అవార్డులను అందించారు. క్యాష్ రివార్డులు తీసుకోవడంతో గురుతర బాధ్యత పెరిగిందని భావించి మరింతగా దాడులు పెంచి ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, ఖమ్మం, హౖదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్లు జి .గణేష్, అనిల్ కుమార్రెడ్డి డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్లు పాల్గోన్నారు.