ప్లే ఆఫ్స్‌ కు ఎవరు వెళతారంటే?

By Ravi
On
ప్లే ఆఫ్స్‌ కు ఎవరు వెళతారంటే?

ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన ఈ టైమ్ లో, ప్లే ఆఫ్స్ రేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. టీమ్స్ తమ అవకాశాలను నిలబెట్టుకోవడానికి అవసరమైన విజయాల కోసం పోరాడుతున్నాయి. 16 పాయింట్ల కట్‌ ఆఫ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రతి జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు ఇంకా ఎంత దూరం వెళ్లాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మిగిలిన 4 మ్యాచ్‌లలో కనీసం 1 విజయం సాధిస్తే 16 పాయింట్లకు చేరుకుంటారు, ప్లే ఆఫ్స్ ఆశలు బలంగా ఉంటాయి. గుజరాత్ టైటాన్స్.. మిగిలిన 6 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. నెక్ట్స్ ముంబై ఇండియన్స్ టీమ్.. మిగిలిన 4 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే 16 పాయింట్ల మార్క్‌ను చేరుకుంటారు. 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్.. మిగిలిన 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటారు. మరోపక్క పంజాబ్ కింగ్స్ మిగిలిన 5 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధిస్తే అర్హత సాధించే అవకాశం ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మిగిలిన 4 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధిస్తే 16 పాయింట్లకు చేరుకుంటారు. కోల్ కతా నైట్ రైడర్స్.. మిగిలిన 5 మ్యాచ్‌లలో అన్ని 5 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ అవకాశాలు పోతాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్.. మిగిలిన 5 మ్యాచ్‌లలో అన్ని 5 విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్స్ ఆశలు ముగుస్తాయి. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లకు చేరుకునే అవకాశం లేదు. దీంతో ఈ టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో లేనట్టే. అండ్ ఫైనల్లీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం లేదు దీంతో ఈ టీమ్ కి కూడా ప్లే ఆఫ్స్ రేసులో అవకాశం లేనట్టే.

Tags:

Advertisement

Latest News

గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు గ్రూప్ 1 అభ్యర్థులకు జరిమానా విధించిన హైకోర్టు
గ్రూప్‌1 పిటీషనర్లకు  హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...
శ్రీకాళహస్తిలో పల్లెనిద్ర..మాటమంతిలో పాల్గొన్న స్థానిక పోలీస్ అధికారులు
కొంపల్లి రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్