షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
By Ravi
On
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తోంది. విషయం గమనించిన స్థానిక రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నాలుగు లారీలు సీజ్ చేసి వాటి యజమానులపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూముల్లో మట్టిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఇంకా ఎక్కడెక్కడ మట్టిమాఫియా పాగా వేసిందని వివరాలు సేకరిస్తున్నారు.
Tags:
Latest News
27 Apr 2025 21:46:51
రాసిపెట్టుకోండి ఇక వచ్చేది మనమే.. ప్రజలకు సంక్షేమం చేస్తుంది మనమే.. కల్లబొల్లి కబుర్లు చెప్పము.. చెప్పింది చేసి చూపిస్తాము. ప్రత్యేక రాష్ట్రం కోసం పడ్డ కష్టం కాంగ్రెస్...