తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రధానకార్యదర్శిగా రామకృష్ణా రావు నియమితులు కాగా 20మంది అధికారులకు వివిధ శాఖలకు కేటాయించారు. ఆ వివరాలు...
గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్ - శశాంక్ గోయల్,
ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈవో- జయేశ్ రంజన్
పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక, ముఖ్యకార్యదర్శి-సంజయ్ కుమార్,
ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ - స్మితా సబర్వాల్,
కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - దానకిశోర్,
పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి (హెచ్ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి,
పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్ఎండీఏ పరిధి) ,
జీహెచ్ఎంసీ కమిషనర్ - ఆర్వీ కర్ణన్,
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక,
జెన్కో సీఎండీ - ఎస్. హరీశ్,
రాష్ట్రమానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో నిఖిల,
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ - సంగీతం సత్యనారాయణ,
దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో ఎస్. వెంకటరావు,
సెర్ప్ అదనపు సీఈవో - పి. కాత్యాయనీదేవి,
ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవో ఈవీ నర్సింహారెడ్డి,
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ - హేమంత్సహ రావు,
టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ - ఫణీంద్రారెడ్డి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ - కధిరవన్,
హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాసాగర్,
హెచ్ఎండీఏ సెక్రటరీ - ఉపేందర్ రెడ్డి నియమితులయ్యారు.