మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి
By Ravi
On
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భువనేశ్వరి నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మస్కిటో కాయిల్ పరుపు మీద పడి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో చిన్నారిక పరిస్థితి విషమంగా ఉంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్.. అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపుపై పడి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరాడక రెహమాన్ స్పాట్లోనే మృతిచెందాడు. ఇంకో కుమారుడు అతిఫా ఆరోగ్యం విషమంగా ఉండడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
27 Apr 2025 05:35:51
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...