బోయిన్పల్లి బాపూజీ నగర్లో అగ్నిప్రమాదం
By Ravi
On
సికింద్రాబాద్లోని బోయిన్పల్లి బాపూజీ నగర్లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. పోచమ్మ గుడి సమీపంలో ఉన్న కట్టెల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, రెండు ఫైర్ టెండర్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం గాను దీపం నుండి మంటలు అంటుకోవడమేనని కొందరు నివేదించారు.
Related Posts
Latest News
08 May 2025 10:51:12
చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కేశవగిరి ప్రాంతంలో ఓ ఇంట్లో నుండి మంటలు వస్తున్నాయంటూ స్థానికులు డయల్ 100కి సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న...