చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం
By Ravi
On
కూకట్పల్లి TPN :
కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధిపై హైడ్రా మరియు జీహెచ్ఎంసి అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఐదు చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. అందులో రెండు చెరువులను హైడ్రా, మిగిలిన మూడు చెరువులను జీహెచ్ఎంసి అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.
నల్లచెరువు వద్ద సుమారు 30 ఎకరాల ప్రైవేట్ భూమి ఉండగా, పట్టాదారులకు టిడిఆర్లు (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) ద్వారా న్యాయం చేస్తే వారు అభివృద్ధికి అడ్డుకాదని తెలిపారు. ప్రజలను ఒప్పించేందుకు తానే ముందుంటానన్నారు. ఇప్పటికే పలువురు భూస్వాములతో చర్చలు జరుపుతున్నామని, అన్ని చెరువుల అభివృద్ధికి టిడిఆర్లు మంజూరు చేస్తే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదని అన్నారు.
Related Posts
Latest News
06 May 2025 22:04:02
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను...