గౌతమ్ గంభీర్ ను చంపేస్తామంటూ బెదిరింపులు..
టీమిండియా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. నిన్ను హతమారుస్తాం అంటూ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఐ కిల్ యూ అంటూ తనకు ఈ మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గంభీర్ కంప్లైంట్ చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం గంభీర్ కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐ కిల్ యూ అంటూ తనకు రెండు ఈ మెయిల్స్ వచ్చినట్లు గౌతమ్ గంభీర్ సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను కోరారు.
గంభీర్ ఫిర్యాదు మేరకు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనే దానిపై సైబర్ సెల్ విచారణ చేపట్టింది. ఐసిస్ కశ్మీర్ నుంచి ఈ హత్యా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పహల్గాం ఉగ్ర దాడిపై రియాక్ట్ అయినందుకే గంభీర్కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్లోని పహల్గాం సమీప బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 30 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు.