చంచల్ గూడ మహిళ జైల్ ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారదా
By Ravi
On
చంచల్ గూడ మహిళ జైలును మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద సందర్శించారు. చైర్ పర్సన్ తో పాటు చంచల్ గూడ జైలుకు కమిషన్ సభ్యులు కూడా హాజరయ్యారు. మహిళ జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులపై ఆరా తీశారు. మూలాకత్, న్యాయ సహయం గూర్చి జైలు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మీని అడిగి తెలుసుకున్న మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఖైదీలతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఖైదీల స్వయం ఉపాధి పథకాలు, వైద్య సౌకర్యాలపై కూడా వాకబు చేశారు. మహిళ జైల్ లో సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
Tags:
Latest News
06 May 2025 18:00:29
జమ్మూకాశ్మీర్ ఘటనతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో బుధవారం కీలక భద్రతా విన్యాసాలు (మాక్ డ్రిల్స్) నిర్వహించనున్నారు. ఇటీవల...