కాచిగూడలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ..!

By Ravi
On
కాచిగూడలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ..!

యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన నేపాలీ పనివారు భారీ చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ. 3 కోట్ల నగదుతో ఉడాయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగాఉంచుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వారం క్రితం నేపాల్‌కు చెందిన భార్యాభర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు, కోడలు విదేశీయాత్రకు వెళ్లారు. పారిశ్రామికవేత్త, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఆదివారం రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతులు మత్తులోకి వెళ్ల గానే.. ఇంట్లోని స్వర్ణాభరణాలు, నగదుతో ఉడాయించారు. నిత్యం మార్నింగ్ వాక్‌కు వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో.. సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపుతట్టారు. అప్పటికీ మగతలోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు. ఆ తర్వాత దొంగతనం విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్ శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్
ఇటీవలే కిమ్స్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. రీ హాబ్  కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి...
ఘనంగా సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు..!
బావ హత్యకు దారితీసిన బావమరుదుల గొడవ.. బంజారాహిల్స్ లో కేస్ బుక్
సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం