మస్క్‌తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాని మోదీ

By Ravi
On
మస్క్‌తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాని మోదీ

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ లో మాట్లాడారు. టెక్నికల్ గా, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎలాన్‌ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్‌ పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించినట్లు తెలిపారు. 

కాగా సంబంధిత రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌ కట్టుబడి ఉంది అంటూ ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేశారు. అంతేకాకుండా భారత్, అమెరికాకు మధ్య వాణిజ్య చర్చల టాపిక్ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ట్రంప్‌ కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తో సైతం మోదీ భేటీ అయ్యారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!