మస్క్‌తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాని మోదీ

By Ravi
On
మస్క్‌తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాని మోదీ

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ లో మాట్లాడారు. టెక్నికల్ గా, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎలాన్‌ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్‌ పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించినట్లు తెలిపారు. 

కాగా సంబంధిత రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌ కట్టుబడి ఉంది అంటూ ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేశారు. అంతేకాకుండా భారత్, అమెరికాకు మధ్య వాణిజ్య చర్చల టాపిక్ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ట్రంప్‌ కేబినెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తో సైతం మోదీ భేటీ అయ్యారు.

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..