రూ. 200 కోసం తల్లిని కడతేర్చిన కొడుకు..

By Ravi
On
రూ. 200 కోసం తల్లిని కడతేర్చిన కొడుకు..

ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని హతమార్చడం, పిల్లలు తల్లిదండ్రుల్ని కడతేర్చడం నిత్యం ఎక్కడోచోట జరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా తల్లిపాలిట కన్నకొడుకే యముడయ్యాడు. కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌ గఢ్‌ లోని రాయ్‌పూర్‌ లో నేడు చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్కను కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు. 

కాగా ఈ సంఘటన ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేశ్వర్ నగర్‌లో జరిగింది. నిందితుడు ప్రదీప్ దేవాంగన్ ఈ రిక్షా డ్రైవర్. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దేవాంగన్ రూ.800 పెట్టి ఓ కుక్కపిల్ల కొనాలనుకున్నాడు. దానికి రూ.200 తక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వాలని తన తల్లి గణేషిని అడిగాడు. బాధితురాలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దేవాంగన్ ఆమెను సుత్తితో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో తనకు అడ్డు వచ్చిన తన భార్య రామేశ్వరిపై కూడా దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Latest News

మన అంతర్గత శత్రువును ఓడించండి.. ఎక్స్ లో సీనియర్ ఐపీఎస్ రమేష్ మస్తిపురం పిలుపు మన అంతర్గత శత్రువును ఓడించండి.. ఎక్స్ లో సీనియర్ ఐపీఎస్ రమేష్ మస్తిపురం పిలుపు
సరిహద్దుల్లో శాంతి నెలకొంది మన శత్రువులకు మనమేంటో చూపించాము.. బట్ మన అంతర్గత శత్రువును వదిలేస్తున్నాము.. అదే బెట్టింగ్ యాప్స్ రూపంలో మనపై విరుచుకుపడే ఆయుధంగా మారుతోంది.....
త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం
బెన్నాటో కాల్ హెర్బల్ పౌడర్ వాడుతున్నారా.. అయితే మీకిడ్నీలు పాడైనట్లే..
అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం