సంజు శాంసన్ కు ఫ్యాన్స్ సూచనలు..

By Ravi
On
సంజు శాంసన్ కు ఫ్యాన్స్ సూచనలు..

రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజు శాంసన్‌ల మధ్య గొడవలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సూపర్ ఓవర్ రిజల్ట్ అని తెలుస్తోంది. ఐపీఎల 2025 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్‌ రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ పై ఢిల్లీ విజయం సాధించింది. ఇదే కారణమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ కు వచ్చేయమని సూచనలు చేశారు. నిజానికి ఢిల్లీతో సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రియాన్ పరాగ్‌, షిమ్రోన్ హెట్‌ మయెర్‌ వచ్చారు. 

యశస్వి జైస్వాల్‌ను రెండో వికెట్‌గా పంపించారు. సాధారణంగా సంజుశాంసన్‌ ఓపెనర్‌గా వస్తాడు. కానీ పక్కటెముకల నొప్పి కారణంగా సంజు గ్రౌండ్ లోకి రాలేదు. దీంతో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశారు. సూపర్ ఓవర్ కు ముందు కోచ్ ద్రవిడ్ తన టీమ్ తో మాట్లాడుతూ కనిపించాడు. కెప్టెన్ సంజు మాత్రం డగౌట్ కు దగ్గరగా ఉండగా, దగ్గరకు రమ్మని పిలిచినా వెళ్లలేదు. దీంతో అభిమానులు సంజును కెప్టెన్సీని వదిలేయమని సూచించడంతోపాటు జట్టును మారిపోవాలని కోరారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!