పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!

By Ravi
On
పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!

హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి తీవ్రఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను అమానుషమైనవిగా అభివర్ణించిన వారు, నిరసనల పేరుతో కొందరు ముష్కరులు హిందువులపై దాడులు చేసి హత్యలు చేయడాన్ని ఖండించారు. సైదాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు.అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి, పశ్చిమబెంగల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ దాడుల వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సంఘటనలు హిందువుల శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు సుభాష్ చందర్, సహదేవ్ యాదవ్, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, దశరథ లక్ష్మి, ఉగాది మహేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!