బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!

By Ravi
On
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!


హైదరాబాద్ TPN : బోరబండ సెంట్రీ వీకర్ సెక్షన్ నుంచి నవభారత్‌నగర్ కాకతీయ హిల్స్‌కి వెళ్లే రహదారిలో రేకులతో కొంతమంది వ్యక్తులు అడ్డుకంచె ఏర్పాటు చేశారు. ఈ అడ్డుకంచె వేసి దాదాపు పది రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ జిల్లా కన్వీనర్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సతీష్‌చారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ వీకర్ సెక్షన్‌కు సంబంధించిన పలువురు బస్తీవాసులు.. హైటెక్ సిటీ ఐటీ కంపెనీలలో హౌస్‌కీపింగ్, ఆఫీస్‌బాయ్, ఇతర ఉద్యోగాలు చేసే మహిళలు ఈ నడకదారినే వెళతారని చెప్పారు. అలాంటి రోడ్డుకు అడ్డుకంచ వేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ చూపి అడ్డుకంచెని తొలగించేలా చూడాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే.. పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సతీష్ చారి, వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, మల్లేష్ నాయక్, గిరీష్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!