ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

By Ravi
On
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

హైదరాబాద్‌ TPN: 

జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలాజీ లే అవుట్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న తేజ అనే 30 ఏళ్ల మహిళ.. తన ఇద్దరు కుమారులను కొబ్బరిబోండాల కత్తితో నరకగా.. 11 ఏళ్ల హర్షిత్‌ అక్కడికక్కడే చనిపోయాడు. 8 ఏళ్ల ఆశిష్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు కుమారులపై కత్తితో దాడిచేసిన తేజ.. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు తేజ మానసిక పరిస్థితి కూడా బాగోలేకపోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!