ఏపీ లిక్కర్‌స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు..!

By Ravi
On
ఏపీ లిక్కర్‌స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు..!

హైదరాబాద్‌ TPN:

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో భాగంగా హైదరాబాద్‌లో సిట్‌ విచారణ కొనసాగుతోంది. లిక్కర్‌స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కంపెనీల్లో సిట్‌ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ కంపెనీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కసిరెడ్డి పలు కంపెనీలు స్థాపించారు. ఇకపోతే.. సిట్‌ అధికారులు నాలుగోసారి కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!