రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు..!
రంగారెడ్డి TPN : బాలాపూర్ మండలం మామిడిపల్లిలో రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. తమ దగ్గర నుంచి బలవంతంగా భూముల్ని లాక్కొని రేవంత్ సర్కార్ వాటికి ఫెన్సింగ్ వేసిందని ఆరోపించారు. రేపోమాపో ఈ భూములనూ అమ్మేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడిపల్లిలోని సర్వే నంబర్ 99/1లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. తాతముత్తాతల నుంచి ఆ భూముల్లోనే సాగు చేసుకొని జీవించినట్లు చెప్పారు. 186 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారని.. ఏ రైతుకు ఎంత భూమి ఉందో రెవెన్యూ అధికారులకు తెలుసన్నారు. ఎయిర్పోర్ట్ కోసమని భూమి తీసుకున్న ప్రభుత్వం.. రైతులకు పైసా పరిహారం ఇవ్వకపోగా.. ఆ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకుంటోదని ఆరోపించారు. తమకు న్యాయం చేసేంత వరకు భూములను ఇవ్వబోమని తెలిపారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా.. ప్రతి రైతుకు న్యాయం చేసి నిరూపించుకోవాలని కోరారు.