రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు..! 

By Ravi
On
రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు..! 

రంగారెడ్డి TPN : బాలాపూర్ మండలం మామిడిపల్లిలో రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. తమ దగ్గర నుంచి బలవంతంగా భూముల్ని లాక్కొని రేవంత్‌ సర్కార్‌ వాటికి ఫెన్సింగ్‌ వేసిందని ఆరోపించారు. రేపోమాపో ఈ భూములనూ అమ్మేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడిపల్లిలోని సర్వే నంబర్ 99/1లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. తాతముత్తాతల నుంచి ఆ భూముల్లోనే సాగు చేసుకొని జీవించినట్లు చెప్పారు. 186 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారని.. ఏ రైతుకు ఎంత భూమి ఉందో రెవెన్యూ అధికారులకు తెలుసన్నారు. ఎయిర్‌పోర్ట్ కోసమని భూమి తీసుకున్న ప్రభుత్వం.. రైతులకు పైసా పరిహారం ఇవ్వకపోగా.. ఆ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకుంటోదని ఆరోపించారు. తమకు న్యాయం చేసేంత వరకు భూములను ఇవ్వబోమని తెలిపారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా.. ప్రతి రైతుకు న్యాయం చేసి నిరూపించుకోవాలని కోరారు.

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!