ఆ కారణంతో రక్షణ అడగొద్దు: హైకోర్టు

By Ravi
On
ఆ కారణంతో రక్షణ అడగొద్దు: హైకోర్టు

తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంట.. ఆ కారణంతో పోలీసు రక్షణ కోరలేరని అలహాబాద్‌ హైకోర్టు కామెంట్ చేశారు. తమ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తామని వెల్లడించింది. జంటలు ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని న్యాయస్థానం సూచించింది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన శ్రేయ కేసర్వానీ పెద్దలను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు, తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శ్రేయ, ఆమె భర్త అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

తన తీర్పులో.. వీరి పిటిషన్‌ ను పరిశీలించిన తర్వాత ఈ జంటకు ఎలాంటి తీవ్రమైన ముప్పు పొంచి లేదని అర్థమవుతోంది. కేవలం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నంత మాత్రాన అలాంటి జంటకు పోలీసు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇదేతరహా కేసులో తీర్పునిచ్చింది. దాని ఆధారంగా తాజా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదు. నిజంగా ముప్పు ఉండే కేసులకు మేం భద్రత కల్పిస్తాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!