ఆ కారణంతో రక్షణ అడగొద్దు: హైకోర్టు

By Ravi
On
ఆ కారణంతో రక్షణ అడగొద్దు: హైకోర్టు

తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంట.. ఆ కారణంతో పోలీసు రక్షణ కోరలేరని అలహాబాద్‌ హైకోర్టు కామెంట్ చేశారు. తమ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తామని వెల్లడించింది. జంటలు ఒకరికొకరు అండగా నిలుస్తూ సమాజాన్ని ఎదుర్కోవాలని న్యాయస్థానం సూచించింది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన శ్రేయ కేసర్వానీ పెద్దలను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు, తమ వైవాహిక జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శ్రేయ, ఆమె భర్త అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

తన తీర్పులో.. వీరి పిటిషన్‌ ను పరిశీలించిన తర్వాత ఈ జంటకు ఎలాంటి తీవ్రమైన ముప్పు పొంచి లేదని అర్థమవుతోంది. కేవలం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నంత మాత్రాన అలాంటి జంటకు పోలీసు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇదేతరహా కేసులో తీర్పునిచ్చింది. దాని ఆధారంగా తాజా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదు. నిజంగా ముప్పు ఉండే కేసులకు మేం భద్రత కల్పిస్తాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!