సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా

By Ravi
On
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా

రంగారెడ్డి జిల్లా,
ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద సోమవారం ఉదయం హైడ్రామా చోటు చేసుకుంది. నగరంలోని మూసాపేట నుంచి వచ్చిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి మరియు బసవరాజు, కొంతమంది కేర్‌టేకర్లతో కలిసి కోకాపేటలోని ఇంటి వద్దకు చేరుకున్నారు.ఇప్పటికే ఆ ఇంటిలో నివాసం ఉంటున్న లావణ్య అనే మహిళతో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. "ఇది మా కుమారుడి సొంత ఇల్లు. ఇప్పటివరకు కిరాయి ఇంటిలో ఉండటం వల్ల ఇప్పుడు ఇక్కడే వేరొక గదిలో నివాసముండాలని వచ్చాము" అని తల్లిదండ్రులు తెలిపారు. అయితే లావణ్య ఈ విషయాన్ని ఖండిస్తూ, "తనను ఇంటి నుండి గెంటివేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు" అని ఆరోపించారు.లావణ్య తెలిపిన వివరాల ప్రకారం, తాను ఇప్పటికే రాజ్ తరుణ్‌తో కలిసి ఉండిందనీ, తమ మధ్య కేసు కోర్టులో నడుస్తోందనీ వెల్లడించారు. "ఇంటి లోపలికి వచ్చి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. నాపై దౌర్జన్యానికి పాల్పడ్డారు" అంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఇక రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, లావణ్య వారిని అడ్డగించింది. "ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తే మాత్రమే లోపలికి అనుమతిస్తాను" అంటూ స్పష్టం చేసింది.ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారికంగా పోలీసుల స్పందన వెలువడాల్సి ఉంది. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో, ఇరు పక్షాల వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!