బడంగ్పేట్లో కాంగ్రెస్ నేతల పాదయాత్ర..!
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆలోచనల మేరకు రాహుల్గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే నినాదంతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత అన్నారు. అసమానతలను తొలగించి సమాజంలో అందరికీ సమాన హక్కులను కల్పించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే దేశమంతటా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.