బడంగ్‌పేట్‌లో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర..!

By Ravi
On
బడంగ్‌పేట్‌లో కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర..!

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆలోచనల మేరకు రాహుల్‌గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే నినాదంతో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ అల్మాస్‌గూడలో కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర నిర్వహించారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత అన్నారు. అసమానతలను తొలగించి సమాజంలో అందరికీ సమాన హక్కులను కల్పించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే దేశమంతటా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!