బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి

By Ravi
On
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి

బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి

హైదరాబాద్‌: బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం మరొక ప్రాణాన్ని బలి తీసుకుంది. చలానా రాయడానికి రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే, బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్తున్న దారిలో ట్రాఫిక్ పోలీసులు ఓ బైక్‌ను ఆకస్మికంగా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అదుపుతప్పిన బైక్ కిందపడింది. ఆ బైక్‌ను నడుపుతున్న వ్యక్తి తలపై ఆర్టీసీ బస్సు నుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

ఈ ఘటనతో ఆగ్రహించిన వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్థానికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Latest News

కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..! కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్‌ బృందాలు సోదాలు..!
ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో భాగంగా హైదరాబాద్ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు...
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!
అన్నివర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్..!
సన్‌రైజర్స్‌కి తప్పిన ముప్పు.. హుటాహుటీన తరలింపు..!
ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!
కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!
ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..!