చైనాలో గాలుల బీభత్సం.. విమాన సర్వీసులకు బ్రేక్..

By Ravi
On
చైనాలో గాలుల బీభత్సం.. విమాన సర్వీసులకు బ్రేక్..

చైనాలో గాలులు బీభత్సం సృష్టించాయి. తాజాగా నేడు భారీ గాలులు వీచడంతో రాజధాని బీజింగ్‌లో చెట్లు కూలిపోగా.. పాత ఇళ్లులు కూలిపోయాయి. భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా.. పార్కులు మూసేశారు. ఇక భీకర గాలులు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 700 విమాన సర్వీసులు రద్దైనట్లుగా సమాచారం. దీంతో బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

అధికారులు గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చారు. మొదటిసారి ఆరెంజ్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. 1951లో నమోదైన రికార్డులను తాజా తుఫాన్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం విమాన, రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పర్యాటక ప్రాంతాలను మూసేశారు. శుక్రవారం ఢిల్లీలో కూడా భీకరమైన దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. చాలా మంది భూకంపం వచ్చిందేమోనని భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Latest News

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య  శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 
అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం: JCHSL కార్యవర్గం
సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో కాంగ్రెస్‌ నేతల సహపంక్తి భోజనం..!
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి
మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్
కొడుకు మార్క్ శంకర్ తో సింగపూర్ నుండి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్
రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత