హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

By Ravi
On
హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, మరియు నిర్వాహకులు ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ "రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలపై హనుమంతుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన దయతో ప్రతి ఒక్కరి జీవితం విజ్ఞానంతో నిండాలి. భక్తి భావం మన అందరిలో ఉండాలి." అని ఆన్నారు.

ఈ పూజా కార్యక్రమానికి అనేక మంది భక్తులు హాజరై హనుమంతుని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

 

Advertisement

Latest News

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య  శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 
అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం: JCHSL కార్యవర్గం
సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో కాంగ్రెస్‌ నేతల సహపంక్తి భోజనం..!
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి
మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్
కొడుకు మార్క్ శంకర్ తో సింగపూర్ నుండి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్
రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత