నేడు ఆర్సీబీ, డీసీ మ్యాచ్..

By Ravi
On
నేడు ఆర్సీబీ, డీసీ మ్యాచ్..

ఐపీఎల్‌ 2025లో నేడు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. డిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ లలో గెలిచింది. ఈ రోజు జరిగే మ్యాచ్ పై కూడా దృష్టి పెట్టింది. మరోవైపు తమ అద్భుత ఆటతో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచిన బెంగళూరు.. నాలుగో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. సో ఈ రోజు జరిగే మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈరోజు రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్‌ 2025లో ఆర్‌సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటీదార్, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కొహ్లీ ఫామ్ మీదున్నారు. ఇద్దరు హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో అభిమానులు ఇదే జోరు కొనసాగించాలని చుస్తున్నారు. 

ఇక దేవదత్‌ పడిక్కల్‌ గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. మిడిలార్డర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌ లాంటి హిట్టర్లు ఉన్నారు. బెంగళూరు బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. పేస్ కోటాలో జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్‌ దయాళ్‌.. స్పిన్నర్లుగా కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ రాణిస్తున్నారు. ఢిల్లీ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. మెక్‌గుర్క్‌తో కలిసి మెరుగైన ఆరంభాలు ఇస్తున్నాడు. వన్‌డౌన్‌లో అభిషేక్‌ పొరెల్‌ రెచ్చిపోతున్నాడు. అక్షర్‌ పటేల్, ట్రిస్టన్‌ స్టబ్స్, సమీర్‌ రిజ్వి, అశుతోష్‌ శర్మలతో మిడిలార్డర్‌ బాగుంది.

Tags:

Advertisement

Latest News

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..! రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్‌ TPN:  సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి