మ్యాచ్ విన్ అవ్వాలని ఆంజనేయున్ని దర్శించుకున్న ప్రీతి జింటా

By Ravi
On
మ్యాచ్ విన్ అవ్వాలని ఆంజనేయున్ని దర్శించుకున్న ప్రీతి జింటా


దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రీతి జింటా ప్రత్యేకంగా అక్షింతలు తీసుకొని వెళ్లింది. నేడు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. 

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ.. కొండంత బలమివ్వు స్వామి అంటూ వీరాంజనేయ స్వామిని దర్శించుకుంది ప్రీతి జింట. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆశించినంతగా రాణించడం లేదు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో, ఒకే ఒక్క విజయం సాధించి నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. నేడు జరుగబోయే మ్యాచ్ లో విక్టరీ కొట్టాలని సంకల్పం పెట్టుకుంది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!