ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపకంపై విజిలెన్స్ డీజీ ఆరా

By Ravi
On
ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపకంపై విజిలెన్స్ డీజీ ఆరా

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్‌రాజ్, ట్రెజరర్ శ్రీనివాస్‌తో విజిలెన్స్‌ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం ఉప్పల్‌లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియపై ఆరా తీశారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సెక్రటరీ, ట్రెజరర్‌లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి కాంప్లిమెంటరీ టికెట్ మొదటగా చేరుకునేది వీళ్లిద్దరు దగ్గరకే.  కాబట్టి వీళ్లిద్దరి నుంచే టికెట్లు పక్కదారి పట్టినట్టు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇక స్టేడియంలో కార్ పాసులు, బైక్ పాసులు తమ సొంత మనుషులకే జారీ చేస్తున్నట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. కాంప్లిమెంటరీ టికెట్ల పంపిణీ విషయంలో సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాస్ కీలకపాత్ర వహిస్తున్నారు. ఒప్పందం ప్రకారం 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు హెచ్‌సీఏకి వస్తున్నా.. సన్‌రైజర్స్‌ టీమ్‌ యాజమాన్యం తక్కువగా ఇస్తున్నారంటూ బయట ప్రచారం చేసి.. తమ వర్గానికి టికెట్లను పంపిణీ చేస్తున్నట్టు గుర్తించారు. రాచకొండ పోలీసులు ఎక్కువ మొత్తంలో టికెట్లు తీసుకుంటున్నారంటూ సెక్రటరీ దేవ్‌రాజ్‌ బయట ప్రచారం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విజిలెన్స్‌ అధికారుల రంగంలోకి దిగి టికెట్ల పంపిణీపై వివరాలు సేకరించారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!