బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నిర్వహణపై కీలక సమావేశం

By Ravi
On
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నిర్వహణపై కీలక సమావేశం

భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్ ) రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో కరీం నగర్ , ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది . ఈ నెల 27 న వరంగల్ లో జరగనున్న బహిరంగ సభ , పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై సమావేశంలో చర్చించారు . పలు అంశాలపై బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారు రెండు జిల్లాల ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్ , జోగినపల్లి సంతోష్ కుమార్ , మాజీ మంత్రి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ . రమణ , ఎమ్మెల్యేలు డా . కల్వకుంట్ల సంజయ్ , పాడి కౌశిక్ రెడ్డి , అనిల్ జాదవ్ , కోవా లక్ష్మి , పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు (కరీం నగర్ ), తోట ఆగయ్య (సిరిసిల్ల ), జోగు రామన్న (ఆదిలాబాద్ ), బాల్క సుమన్ ( మంచిర్యాల ), 

మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్ , రసమయి బాల కిషన్ , సుంకే రవి శంకర్ , దాసరి మనోహర్ రెడ్డి , కోరుకంటి చందర్ , పుట్టా మధు , కల్వకుంట్ల విద్యాసాగర రావు , నడిపెల్లి దివాకర్ రావు , దుర్గం చిన్నయ్య , పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు , పార్టీ జిల్లాల నాయకులు దావా వసంత , చల్మెడ లక్ష్మీ నరసింహారావు , జాన్సన్ నాయక్ , రామకృష్ణారెడ్డి , రమాదేవి , కిరణ్ కొమ్మెర , విలాస్ , శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు .

Tags:

Advertisement

Latest News