రూపాయి 1.70 లక్షల విలువైన డ్రగ్స్‌ పట్టివేత - 2 కేసుల్లో 27.51 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

By Ravi
On

 

హైదరాబాద్‌లోని నాంపల్లి, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఎక్సైజ్‌ పోలీసులు రెండు కేసుల్లో రూ.1.70 లక్షల విలువైన 27.51 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ముంబయి అంథేరి ప్రాంతం నుండి రంజాన్‌ షేక్‌ అనే వ్యక్తి డ్రగ్స్‌ను నాంపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకురావడంతో, అక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ నేతృత్వంలోని టీమ్‌ అతన్ని పట్టుకుంది. రంజాన్‌ షేక్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో రెండు వ్యక్తులకు 24.10 గ్రాముల ఎండీఎంఏని ఇస్తుండగా, పోలీసులు అతనిని, అలాగే ఇఫ్రాన్‌ మరియు అన్వర్‌ను కూడా అరెస్టు చేశారు.

మల్కాజిగిరి ప్రాంతంలో కూడా ఎక్సైజ్‌ ఎస్‌టీ‌ఎఫ్‌ బీ టీమ్‌ 3.39 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. బెంగుళూరులో నుండి లిఖిత్‌, హరికృష్ణ ఇద్దరు మల్కాజిగిరి ప్రాంతంలో డ్రగ్స్‌ను తీసుకువచ్చి స్వాధీప్‌ అనే వ్యక్తి వద్ద అమ్మకాలు జరుపుతుండగా, ఎస్‌టీ‌ఎఫ్‌ పోలీసులు దాడి చేసి స్వాధీప్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో స్కూటీ, సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ డ్రగ్స్ పట్టికల్లో కీలక పాత్ర పోషించిన సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌, ఎస్సై శ్రీనివాస్‌, హెడ్‌కానిస్టేబుల్ మల్లికార్జున్‌, కానిస్టేబుల్స్ కరణ్‌, శ్రీకాంత్‌, సాయి కుమార్‌, గోపాల్‌, ప్రసాద్‌, నవీన్‌ తదితరులు ఉన్నారు.

మల్కాజిగిరి కేసులో, ఎక్సైజ్‌ ఎస్‌టీ‌ఎఫ్‌ టీమ్‌లో సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, యాదగిరి, అరుణ్‌, శ్రీనివాస రెడ్డి, సాయికిణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!