స్మార్ట్ మీటర్లపై సిపిఎం ఆందోళన

By Ravi
On
స్మార్ట్ మీటర్లపై సిపిఎం ఆందోళన

 

శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల విద్యుత్తు ఉప కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పి. తేజేశ్వరరావు, పార్టీ సభ్యులు విద్యుత్ ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వారు మాట్లాడుతూ, జగన్ సర్కారు, బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులకు వ్యతిరేకంగా వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తారన్నారు. గతంలో వైసిపి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించగా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాటిని కొనసాగించడం మోసకారి నిర్ణయమని పేర్కొన్నారు.

స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు పెరిగిన ఖర్చులు, అధిక విద్యుత్ చార్జీలు ప్రజలపై పెద్ద భారం అవుతాయని వారు ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.బంగార్రాజు, జి.శ్రీనివాసరావు, ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు ఎం.సురేష్, కే. గోవిందకుమార్, ఎల్.రాము, ఎన్. రమణ, ఎల్. సీతారామ్, జె. చిట్టప్పడు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..