ప్లాస్టిక్ వాడొద్దు... పర్యావరణాన్ని నష్టపరచొద్దు
సీఎం చేత ''ప్లాస్టిక్ వినియోగం - ప్రమాద ఘంటికలు'' పుస్తక ఆవిష్కరణ
పర్యావరణ పరిరక్షణకు సే నో టూ ప్లాస్టిక్: మంత్రి సురేఖ
మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు స్టీల్ టిఫిన్ బాక్సు అందజేత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం "సే నో టూ ప్లాస్టిక్" అనే నినాదాన్ని వ్యాప్తి చేయాలని రాష్ట్ర **అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
గురువారం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు కండా సురేఖ చేత "ప్లాస్టిక్ వినియోగం - ప్రమాద ఘంటికలు" అనే పుస్తకం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా, తెలంగాణ శాసనసభ మరియు శాసనమండలి సభ్యులకు జూట్ బ్యాగులు, కాపర్ బాటిల్స్, స్టీల్ టిఫిన్ బాక్సులు, బట్ట సంచులు మరియు పుస్తకాలు అందజేసి, ప్రజలలో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన పెంచేలా ప్రేరేపించారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లు కంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులను వాడి పారేస్తున్నామని చెప్పారు. ప్రతి నిమిషం 10 లక్షలు వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు 630 కోట్ల టన్నులు ఉన్నాయని వివరించారు. వీటిలో 79% ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు మరియు నీటి వనరులు పారేస్తున్నాయని చెప్పారు. మిగతా 12% ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై వదిలేస్తున్నారని, కేవలం 9% మాత్రమే రీసైకిల్ చేయబడుతున్నాయని తెలిపారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్వలు, సరస్సులు, నదీ ప్రవాహాలను అడ్డుకుంటున్నాయని, మొక్కలు, వృక్షాలు, జంతు జలాన్ని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ను కాల్చడం వల్ల కాన్సర్ కారక విషపూరిత వాయులు వెలువడతాయని అన్నారు.
మైక్రో ప్లాస్టిక్లు జంతువులు, మానవ శరీరాల్లోకి చొరబడే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల "ఎస్యూపీ వద్దు", "సే నో టూ ఎస్యూపీ" నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ప్రజలు నిత్య జీవితంలో బయో డిగ్రేడబుల్ వస్తువులను వాడాలని, ప్లాస్టిక్ కవర్లు, నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు వాడటం నివారించి జూట్ బ్యాగులు, బట్ట సంచులను వాడాలని సూచించారు. అలాగే, ప్లాస్టిక్ బాటిల్స్ వాడే విధంగా గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడాలని చెప్పారు.
ప్లాస్టిక్ బాక్సులలో ఆహారాన్ని నిల్వ పెట్టడం తగదు అని తెలియజేస్తూ స్టీల్ టిఫిన్ బాక్సును అందజేశారు.
సురేఖ మాట్లాడుతూ, ఇది ఒక బాధ్యతాయుతమైన చర్య అని, ప్రతి ఒక్కరూ తమ భాగస్వామ్యాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇవ్వాలని కోరారు.