పోలవరం బాధితుల పేర్లు తొలగింపు పై విచారణ: సీఎం చంద్రబాబు హామీ

By Ravi
On
పోలవరం బాధితుల పేర్లు తొలగింపు పై విచారణ: సీఎం చంద్రబాబు హామీ

WhatsApp Image 2025-03-27 at 6.46.05 PM (1)

పోలవరం/ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జాబితా నుండి బాధితుల పేర్లు తొలగించారనే ఆరోపణలపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. గురువారం పోలవరం పర్యటనలో భాగంగా, చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం, ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు.

WhatsApp Image 2025-03-27 at 6.46.06 PMఈ సందర్భంగా, చంద్రబాబు మాట్లాడుతూ, గిరిజనులు, రైతులు ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసి భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రారంభంలో ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉన్నా, నేడు ప్రజా సంక్షేమం దృష్టిలో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

జగన్ ప్రభుత్వంపై పోలవరం నిర్మాణం ఆలస్యానికి, ఖర్చుల పెరిగిపోయిన విషయంపై చంద్రబాబు విమర్శలు చేసారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ 2019 లో 10 లక్షల పరిహారం ఇచ్చేందుకు హామీ ఇచ్చినా, ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 2027 నాటికి పునరావాసం పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు. దళారులు లేకుండా ప్యాకేజీ డబ్బులు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని చంద్రబాబు తెలిపారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడిగా, నిర్వాసితుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
పశ్చిమ్‌బెంగాల్‌లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల...
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!