ఎల్బీనగర్ లో తెగపడిన హైటెన్ష్ వైర్లు.. ఇద్దరు సజీవదహనం

On
ఎల్బీనగర్ లో తెగపడిన హైటెన్ష్ వైర్లు.. ఇద్దరు సజీవదహనం

హైదరాబాద్: ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద జరిగిన ఓ హృదయ విదారక ఘటనలో 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి  ఓ మహిళ, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు.ఈ ప్రమాదంలో ఓ వీధి కుక్క కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సాగర్ రింగు రోడ్డు వద్ద ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద పడుకొని ఉన్న ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అదే సమయంలో వారికి కొద్ది దూరం లో ఓ వీధి కుక్క కూడా విద్యుదాఘాతంతో మృతి చెందింది. మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇద్దరి మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Latest News

నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్ నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్
అయినవాడికి అరిటాకులో.. కానివాడికి కంచంలో అనేది పాత సామెతడి. ఇప్పుడు అయినవాడికి ఆఖర్లో అని దానిని మార్చుకోవాలేమో.  మెగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి...
రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు
మాజీ మంత్రి హరీష్ రావుకి అస్వస్థత.. కిమ్స్ కి తరలింపు
ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు
పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్..గంజాయి.. ఓజి కుష్ ఆయిల్ స్వాధీనం
ఎక్సైజ్‌ స్టేషన్లలో ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు