ఎల్బీనగర్ లో తెగపడిన హైటెన్ష్ వైర్లు.. ఇద్దరు సజీవదహనం

On
ఎల్బీనగర్ లో తెగపడిన హైటెన్ష్ వైర్లు.. ఇద్దరు సజీవదహనం

హైదరాబాద్: ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద జరిగిన ఓ హృదయ విదారక ఘటనలో 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి  ఓ మహిళ, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు.ఈ ప్రమాదంలో ఓ వీధి కుక్క కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సాగర్ రింగు రోడ్డు వద్ద ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద పడుకొని ఉన్న ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అదే సమయంలో వారికి కొద్ది దూరం లో ఓ వీధి కుక్క కూడా విద్యుదాఘాతంతో మృతి చెందింది. మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇద్దరి మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Latest News

శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం
శ్రీహరికోట, జూన్ 16:శాతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌), శ్రీహరికోటలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు చెన్నై పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. చెన్నై...
డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు
మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు
వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు
నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్
రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు