శ్రీకాళహస్తిలో 150 లక్షలతో రోడ్డు అభివృద్ధి: హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి పట్టణంలోని బిపిఅగ్రహారం నుంచి కాసారం వరకు రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మొత్తం రూ.150 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మునిరాజు నాయుడు, గాలి మురళి నాయుడు, మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్, వినయ్ ఖాదర్, చెంచయ్య నాయుడు, ఇతర మండల నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను రెండు నెలల్లోనే నెరవేర్చాం. గతంలో వైసీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేసింది. కానీ మేము పని తత్కాల్ చేసి చూపిస్తున్నాం," అని విమర్శించారు.
శ్రీకాళహస్తి పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, మిగిలిన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.