గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
By V KRISHNA
On
ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఇచ్చిన అదేశాల మేరకు ఎన్డీపీఎల్ ( నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్)పై వారం రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. జాహీరాబాద్ ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద ఎస్టీఎప్ సీఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సంగారెడ్డి టిటి ఎఫ్ సీఐ హన్మంత్, చెక్పోస్టు సీఐ మల్లికార్జునబాబు సిబ్బంది కలిసి టూరిస్టు బ స్సులను, కార్లను, అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా గోవా వెళ్లి వస్తున్న బస్సులు, కార్ల చేసిన సోదాల్లో 17 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మద్యం బాటిళ్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఎవరైనా రవాణా చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.
Latest News
09 Jun 2025 18:37:14
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం
మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు
అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్.
...