డిఫెన్స్ క్యాంటీన్ నుండి మద్యం అక్రమరవాణా.. ఎక్సైజ్ దాడి..
By V KRISHNA
On
శంషాబాద్ డిటిఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి డిఫెన్స్ క్యాంటీన్ నుంచి అక్రమంగా తరలి వెళ్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డిఫెన్స్ పార్టీ క్యాంటీన్ నుంచి శేర్లింగంపల్లి హఫీజ్పేట్ మీదుగా ఒక కారులో మద్యం బాటిల్లు అక్రమంగా తరలి వెళ్తున్నాయని సమాచారం మేరకు శంషాబాద్ డిటిసి టీం దాడి చేశారు. కారులో 115 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. 86.25 లీటర్ల మద్యంను సీజ్ చేసుకున్నట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణప్రియ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన లిక్కర్ శారు 2.30లక్షలు ఉంటుందని, నిందితులు రవాణాకు ఉపయోగించిన కారు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.
Tags: #exciseenforcement#
Latest News
08 Jun 2025 18:14:18
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది.
గూడూరు నియోజకవర్గానికి చెందిన...