సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టు చర్యలు

On
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం

తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర ఏరియా డామినేషన్ గస్తీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ గస్తీ కార్యక్రమం చేపట్టబడింది.

పట్టణ సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్ఐ బ్రహ్మనాయుడు నేతృత్వంలో శ్రీహరికోట మరియు తడ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ గస్తీలో పాల్గొన్నారు. గస్తీ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి, రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

వాణిజ్య సంస్థలు, హోటళ్ల నిర్వహణపై కూడా దృష్టి పెట్టారు. రాత్రి 10 గంటల తరువాత షాపులు తప్పనిసరిగా మూసివేయాలని, అసాంఘిక గుంపుల చలనం జరిగే ప్రాంతాల్లో బలమైన నిఘా పెట్టబడుతుందన్నారు.

పోలీసు అధికారులు మాట్లాడుతూ, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, పట్టణంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ గస్తీ వల్ల పట్టణ ప్రజల్లో భద్రతాభావం పెరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Tags: #tirupati

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..