బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..

On
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..

  • కార్పొరేటర్ ఫసియుద్దీన్ పాపాలు అరికట్టాలని కేసీఆర్ కి వినతి..
  • ఫసియుద్దీన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. సర్ది చెప్పిన కేటీఆర్..

మాగంటి గోపీనాథ్ ఇంటికి చేరుకున్న బోరబండకు చెందిన మహిళలు స్థానిక కార్పొరేట్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. నివాళులు అర్పించేందుకు వచ్చిన కేసీఆర్, హరీష్ రావు, కేటిఆర్ లను తమ బోరబండను కాపాడాలని నినాదాలు చేశారు. ఫసియుద్దీన్ అరాచకాలు అడ్డుకోవాలి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేటిఆర్ మాట్లాడుతూ ఇది సరైన సమయం కాదని నచ్చచెప్పారు. బిఆర్ఎస్ పార్టీలో కార్పొరేట్ గా గెలిచి డిప్యూటీ మేయర్ గా ఉండి పార్టీ మారిన ఫసియుద్దీన్ ఆగడాల వల్ల మాగంటి కుడిభుజంగా ఉన్న సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని మహిళలు చెప్పారు. సర్దార్ ఆత్మహత్య మాగంటిని తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మనోవేదనకు గురై ఆస్పత్రి పాలైనారని చెప్పుకొచ్చారు. పోలీసులు కూడా ఫసియుద్దీన్ కే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..