కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
By V KRISHNA
On
మాగంటి గోపీనాథ్ మృతి చెందిన విషయం తెలియగానే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. గోపీనాథ్ మృతదేహానికి నివాళులు అర్పించి భావోద్వేగానికి గురై కంట తడిపెట్టుకున్నాడు. గోపీనాథ్ పిల్లలను పిలిచి వారిని ఓదార్చి ధైర్యం చెప్పాడు. గోపీనాథ్ విషయం తెలిసిన తరువాత లండన్ నుండి వచ్చిన కేటీఆర్ ఆస్పత్రిలో వారి కుటుంబ సభ్యులతోనే వున్నారు. వీరితో పాటుగా తెలుగుదేశం పార్టీ ఏపీ మంత్రి నారా లోకేష్ సతీసమేతంగా వచ్చి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు బిఆర్ఎస్, టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
Related Posts
Latest News
08 Jun 2025 18:14:18
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది.
గూడూరు నియోజకవర్గానికి చెందిన...