మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు.. హాజరైన ముస్లిం సోదరులు..
By Ravi
On
హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీలోని మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాదిమంది ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరాలం ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కమిషనర్ సివి ఆనంద్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ ప్రార్ధన అనంతరం ఇక హజ్ యాత్ర మొదలవుతుందని పలువురు ముస్లిం మత పెద్దలు వెల్లడించారు. ప్రార్ధన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Latest News
07 Jun 2025 22:11:00
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...