మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..

By Ravi
On
మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..

మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో
భార్గవ్ యాదవ్, వర్షితులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.భార్గవ్ యాదవ్ కుంట్లూరుకి చెందిన వ్యక్తి కాగా, వర్షిత్ సైనిక్ పురి, ప్రవీణ్ ఓల్డ్ అల్వాల్, దినేష్ వైజాక్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు.  Accenture సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్ కావడంతో ఎదులాబాదులోని విహారి ఫామ్ హౌస్ లో విందు ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి అక్కడి నుండి డిన్నర్ కోసం హోటల్ కి వెళ్లారు. డిన్నర్ చేసుకొని తిరిగి ఫామ్ హౌస్ కు చేరుకునే సమయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.

Advertisement

Latest News

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..