అబిడ్స్ జగదీష్ మార్కెట్ పై టాస్క్ ఫోర్స్ దాడి.. నకిలీ యాపిల్ ఫోన్ విడిభాగాలు స్వాధీనం..
నకిలీ యాపిల్ బ్రాండ్ సెల్ఫోన్ యాక్సెసరీలను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కోటి రూపాయల విలువ చేసే నకిలీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ బృందం మరియు అబిడ్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న సెల్ఫోన్ యాక్సెసరీలు విక్రయించే షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించి, యాపిల్ బ్రాండ్కు చెందిన నకిలీ మొబైల్ యాక్సెసరీస్ను విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు యాపిల్ లోగోలు మరియు చిత్రాలను ప్యాకింగ్ బాక్స్లపై ముద్రించి నకిలీ మొబైల్ యాక్సెసరీస్ను అసలైన యాపిల్ ఉత్పత్తులుగా చెప్పి కొనుగోలుదారులను మోసం చేస్తూ, అక్రమంగా లాభాలు సంపాదిస్తున్నారు. విక్రమ్ సింగ్ (శ్రీ మాతాజీ మొబైల్స్ యజమాని), సురేష్ కుమార్ (ఆర్.జి మొబైల్స్ యజమాని), నథారాం చౌదరి (రాజారామ్ మొబైల్స్ యజమాని), మొహమ్మద్ (సప్నా మొబైల్స్ యజమాని)పై దాడులు జరిపారు. పట్టుబడిన నిందితులను స్వాధీనం చేసుకున్న నకిలీ వస్తువులను అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.