నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని చంపారు. మావోయిస్టు లేఖ..

By Ravi
On
నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని చంపారు. మావోయిస్టు లేఖ..

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ పై IMG-20250526-WA0048మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని,  మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యామని తెలిపింది. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. 6నెలలుగా మాడ్‌ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని, కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు ఇటీవల లొంగిపోయి వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారాడని రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. ఎన్‌కౌంటర్ ముందు రోజు నుంచి
20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టి
10 గంటల్లో ఐదు ఎన్‌కౌంటర్‌లు చేశారన్నారు. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భంధించిన కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని లేఖలో వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారని, మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదని, మమ్మల్ని వదిలి సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించాం కానీ మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని మాతోటే ఉన్నారని చెప్పారు. పాక్‌తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదని ఆరోపించారు.

Tags:

Advertisement

Latest News

విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025  యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి   ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి  
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి